Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ... భాజపాలోకి జంప్ చేసేందుకు కొండా దంపతులు రెడీ?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:38 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఓ వెలుగు వెలిగిన నాయకురాలు కొండా సురేఖ. మంత్రిగా ఆమె తెలంగాణలో మంచి పాపులారిటీ సాధించారు. ఐతే ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కొన్నాళ్లపాటు జగన్ మోహన్ రెడ్డితో పాటు నడిచిన కొండా సురేఖ ఆ తర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఐతే అక్కడ కూడా ఇమడలేక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఐతే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. 
 
లోక్ సభ ఎన్నికల తర్వాత ఏకంగా 12 మంది కాంగ్రెస్ నాయకులు తెరాస గూటికి చేరిపోయారు. తెరాసతో విభేదించేవారు భాజపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు తర్వాత వంతు కొండా దంపతులకు వచ్చిందంటున్నారు. గత కొన్నిరోజులుగా వారు భాజపా అగ్ర నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 
 
తెలంగాణలోని భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ హామీ మేరకు భాజపా తీర్థం పుచ్చుకునేందుకు కొండా దంపతులు సుముఖంగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి భాజపా కొండా కపుల్ డిమాండ్లకు సరే అంటుందా లేదా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments