Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్విజయ్ సింగ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:37 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మస్లీస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎంఐఎంకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అండతోనే మేయర్ పదవిలో ఎంఐఎం కొనసాగుతుందనే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ జ్ఞప్తికి తెచ్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. 
 
ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీకి దిగుతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments