Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మాటతీరుపై కేంద్రానికి నిఘా నివేదికలు : కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (09:11 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట తీరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రంతోనూ, ఇటు పొరుగు రాష్ట్రాలతోనూ కేసీఆర్ సఖ్యతగా ఉండటం లేదని అందువల్ల తీరని నష్టం వాటిల్లుతుందే గానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతో ఉండకపోగా... నోటి దురుసుతో వ్యవహరిస్తోందని... ఇలాగైతే ఎలా? అని మండిపడ్డారు. సాక్షాత్తు ప్రధానమంత్రినే సన్నాసి, కొత్త బిచ్చగాడు, ఫాసిస్ట్ అంటూ కామెంట్ చేసిన ఘనత కేసీఆర్‌ది అని... ఈ సమాచారం అంతా ఢిల్లీకి వెళ్లదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క వ్యవహారం ఇంటలిజెన్స్ ద్వారా కేంద్రానికి వెళుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీలను నిర్భయంగా కలిశామని... ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలితో ఎవరినీ కలవలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌ను వ్యక్తిగా ఆహ్వానించారే తప్ప... అధికారికంగా ఆహ్వానించలేదని... ఇలాంటి పొరపాట్లన్నీ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తాయని కేసీఆర్ కు హితవు పలికారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments