Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసిస్‌తో ఎంఐఎంకు సంబంధాలు : కిషన్ రెడ్డి ధ్వజం

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (15:48 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో ఎంఐఎంకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులు, సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఈ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై అలసత్వం తగదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ తెలంగాణకు చెందిన పలువురు సానుభూతిపరులు పలుచోట్ల పట్టుబడ్డారని గుర్తుచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ఉగ్రవాద ఘటనలు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments