Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదారి పుష్కరాలంటే మనం కూడా సన్నాసుల్లా వెళ్లి అక్కడ గుండు కొట్టించుకుంటాం... కేసీఆర్ సెటైర్స్

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:42 IST)
తెరాస ప్లీనరీలో 8వ సారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్, తెరాస సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టారు. ఇంకా బంగారు తెలంగాణ కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయంటూ కార్యకర్తలనుద్దేశించి నుడివారు. మధ్యలో మరోసారి ఆంధ్ర పాలకుల గురించి చలోక్తులు విసిరారు. పుష్కరాల గురించి మాట్లాడుతూ... గోదావరి, కృష్ణా పుష్కరాలు అని చెబితే తెలంగాణ నుంచి మనం కూడా సన్నాసుల్లా వెళ్లి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దనో, గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి దగ్గరకో వెళ్లి గుండు కొట్టించుకుంటామని సెటైర్లు విసిరారు. 
 
గోదావరి నది వందల కిలోమీటర్లు తెలంగాణలో పయనించి కేవలం 60 కిలో మీటర్ల లోపే ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తుందనీ, అలాంటిది పుష్కరాలు వారు నిర్వహించడమేమిటో తనకు అర్థం కాదన్నారు. వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరి నది ఒడ్డున బాసర సరస్వతి దేవి ఆలయం, కాళేశ్వరంలో మహేశ్వరుని ఆలయం, మంధనిలో గౌతమేశ్వర స్వామి ఆలయంతోపాటు రాముడు, సరస్వతి దేవాలయాలున్నాయనీ, కావలసిస్తే అక్కడ పుష్కర స్నానం చేసి గుండు కొట్టించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా తెలంగాణ నాయీబ్రాహ్మణులకు పని దొరుకుతుందని చెప్పుకొచ్చారు.
 
ప్లీనరీ భోజన విరామం సమయంలో మంత్రులు వేణుగోపాలాచారి, తుమ్మల నాగేశ్వర రావులతో కలిసి కేసీఆర్ తెలంగాణ వంట రుచులను చూశారు. అనంతరం కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments