యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో నలుగురు సీఎంలు

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో నలుగురు ముఖ్యమంత్రులు కెమెరా కంటికి చిక్కారు. ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభ బుధవారం జరుగనుంది. ఇందులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌లు స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అలాగే, యూపీ మాజీ సీఎం అఖిలేష్ సింగ్ యాదవ్‌తో పాటు సీపీఐ జాతీయ నేత రాజాతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 
 
అంతకుముందు జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఇందులో జాతీయ నేతలంతా పాల్గొన్నారు. ఆ తర్వాత వారంతా యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడ నరసింహా స్వామి దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా చిత్రీకరించారు. ముఖ్యమంత్రుల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. యాదాద్రి వ్యాప్తంగా 2 వేలమంది పోలీసులతో భద్రత కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments