కేసీఆర్ అప్పుల అప్పారావు: బీజేపీ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:20 IST)
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్‌ని అబద్ధాలకు అంబాసిడర్‌ను చేయాలన్నారు. అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనత

కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్.. అప్పుల అప్పారావుగా మారారంటూ విమర్శలు గుప్పించారు. అనేక అంశాలపై కాగ్ రిపోర్ట్.. ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగానికి కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లు ఇచ్చిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఏనాడూ కోరలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని దుమ్మెత్తిపోశారు.

1990లోనే తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేసిందని లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రొఫెసర్ జయశంకర్‌ని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాంను అవమానించారని అన్నారు. తెలంగాణలో త్వరలోనే కల్వకుంట్ల పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలన టీఆర్ఎస్‌ది అయినా.. ఎంఐఎం అజెండా కొనసాగుతోందన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను పీఏసీ చైర్మన్‌గా చేయడం అనైతికం అని ప్రభుత్వ విధానాలను లక్ష్మణ్ తీవ్రంగా తప్పుపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments