Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ మరో గాంధీ: మంత్రి ఎర్రబెల్లి

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (13:41 IST)
పల్లెల ప్రగతి కోసం మహాత్మాగాంధీ కన్న కలలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ గ్రామాల సమగ్రాభివృద్ధికి నడుం బిగించారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మహాత్ముడి తర్వాత మరో గాంధీగా మారారని కొనియాడారు.

గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అని బలంగా నమ్మి గ్రామ స్వరాజ్య స్థాపనకు గాంధీ కలలు కన్నారని, అయితే అప్పటి ప్రభుత్వాలు ఆయన కలలు, ఆదర్శాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ గ్రామాలను ఆదర్శ పల్లెలుగా మార్చడంతో పాటు స్వయం సమృద్ధిని సాధించే దిశలో కేసీఆర్‌ వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల గురించి ఇంతగా ఆలోచించే సీఎంను చూడలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. శాసనమండలిలో పల్లెప్రగతిపై స్వల్ప వ్యవధి చర్చకు ఎర్రబెల్లి సమాధానమిస్తూ.. 150 మంది జనాభా ఉన్న గ్రామాలకు కూడా ప్రభుత్వం ఏడాదికి రూ.5 లక్షల గ్రాంట్‌ను విడుదల చేస్తుందని చెప్పారు.

గ్రామాలు బాగుపడాలనే ధ్యేయంతో నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమానికి నిధుల కొరత లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments