Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు-కేసీఆర్ ఫోటోల వార్... ఇద్దరు ఫోటోలు పీకేశారు...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (16:01 IST)
తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య ఎలాంటి గొడవలు ఇప్పటికైతే లైవు కానీ నాయకుల మధ్య మాత్రం ఈ గొడవలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాదులోని గురజాడ హాలులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఐతే అంతకుముందు ఆ హాలులో అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు గోడలకు వేలాడుతూ ఉన్నాయి. 
 
సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నేపధ్యంలో అటువైపు ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి కిందపెట్టేశారు కొందరు అధికారులు. దీనిపై తెలంగాణ అధికార బృందం అభ్యంతరం పెట్టింది. వెంటనే ఫోటోను తగిలించాలని కోరింది. ఐతే అందుకు ఏపీ అధికారులు ఒప్పుకోకపోవడంతో వారు నేరుగా వెళ్లి గోడకు తగిలించి ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను తీసేసి కింద పెట్టేశారు. ఇలా ఎవరి ఫోటోను అక్కడ లేకుండా చేశారు. 
 
ఇంతలో ఏపీ సీఎం రావడం, మీడియా సమావేశంలో మాట్లాడటం, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. కానీ ఫోటోలను తగిలించేందుకు మాత్రం ఎవ్వరి గొడవ వాళ్లదే అన్నట్లుగా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments