Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా దేశ ద్రోహి - వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు : కేఏ పాల్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:18 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక దేశ ద్రోహి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. పైగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 సీట్లకు పరిమితమైందని, వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య 30 లేదా 20కు చేరుతుందన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతిమయ పార్టీలేనని ఆయన అన్నారు. 
 
బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై జరిగిన సిరా దాడిని ఆయన ఖండించారు. తెలంగాణలో రెడ్డి సింహగర్జన పేరుతో సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ, అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని, మాటల ద్వారా దాడి చేసుకోవచన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments