Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాప్రతినిధులను వేధిస్తున్న కేసీఆర్ సర్కారు : కె జానారెడ్డి

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (14:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం టీ ప్రజాప్రతినిధులను వేధిస్తోందని శాసనసభ విపక్ష నేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకుగాను జానారెడ్డి (కాంగ్రెస్), ఆర్. కృష్ణయ్య (టీడీపీ), ఎర్రబెల్లి దయాకర్ రావు (టీడీపీ... సభకు రాలేదు) మినహా మిగిలిన విపక్ష సభ్యులందరినీ ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయంతెల్సిందే. 
 
ఈ చర్యకు నిరసనగా జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగని దురదృష్టకర సంఘటన ఇపుడు చోటుచేసుకుందన్నారు. శాసనసభ నుంచి సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై చర్చించాలని కోరిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
 
ప్రజాప్రతినిధులను వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే ప్రకటన ఏదీ చేయకపోగా.. విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. రైతు సమస్యలపై విపక్షాల సూచనలు ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని... వెంటనే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments