Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ భారీ విగ్రహం... 28న ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 3 మే 2023 (13:18 IST)
ఖమ్మం జిల్లాలోని లంకారం ట్యాంక్ బండ్‌పై స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆవిష్కరించనున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 54 అడుగుల మేరకు ఉంది.
 
ఈ విగ్రహ ఆవిష్కరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌ నగరంలోని ఆయన నివాసంలో కలుసుకుని, విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి తరలింపునకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 54 అడుగులు వస్తుంది. 
 
ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీరం ఎత్తు 45 అడుగులుగా ఉంది. ఎటు చూసినా 36 అడుగులు పొడవు, వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్‌పై ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ.2.3 కోట్లను వెచ్చించారు. ఈ విగ్రహం తయారీ, ఏర్పాటులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక భూమిక పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments