Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ భారీ విగ్రహం... 28న ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 3 మే 2023 (13:18 IST)
ఖమ్మం జిల్లాలోని లంకారం ట్యాంక్ బండ్‌పై స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆవిష్కరించనున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 54 అడుగుల మేరకు ఉంది.
 
ఈ విగ్రహ ఆవిష్కరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌ నగరంలోని ఆయన నివాసంలో కలుసుకుని, విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి తరలింపునకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 54 అడుగులు వస్తుంది. 
 
ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీరం ఎత్తు 45 అడుగులుగా ఉంది. ఎటు చూసినా 36 అడుగులు పొడవు, వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్‌పై ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ.2.3 కోట్లను వెచ్చించారు. ఈ విగ్రహం తయారీ, ఏర్పాటులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక భూమిక పోషించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments