Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి ఈటెల రాజేందర్.. జేపీ నడ్డాతో 45 నిమిషాల పాటు భేటీ

Webdunia
సోమవారం, 31 మే 2021 (22:02 IST)
టీఆర్ఎస్ గూటి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 
 
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. అందులో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలుస్తోంది.
 
తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు ప్రస్తుతం అనువైన పరిస్థితులు ఉన్నాయని జేపీ నడ్డాకు వివరించిన ఈటల రాజేందర్.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అందుకు తగ్గట్టుగా నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించినట్టు సమాచారం. 
 
జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ సుమారు 45 నిమిషాలు పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అయితే ఆయన ఎప్పుడు పార్టీలో చేరే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments