Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధం : జగ్గారెడ్డి

Webdunia
బుధవారం, 23 జులై 2014 (08:54 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తనను కలిసిన సంగారెడ్డి టీడీపీ మహిళా నేతకు ఆయన స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తెలంగాణాలో టీడీపీని మరింత బలపేతం చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ ఉన్న ముఖ్యనాయకులపై ఆయన దృష్టి పెట్టారు. టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కోనేందుకు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
 
చంద్రబాబు సూచన మేరకు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ బుధవారం జగ్గారెడ్డిని సంప్రదించారు. చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని జగ్గారెడ్డి శశికళకు స్పష్టం చేసినట్టు సమాచారం. 2019లో టీడీపీని తెలంగాణాలో అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments