పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్ళు... ఎక్కడ నుంచి?

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (17:16 IST)
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అలాగే, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ యాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు వెళుతుంటారు. ఈ భక్తులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని  పేర్కొంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ బోగీల సదుపాయం కల్పించినట్టు తెలిపారు. అలాగే అన్‌ రిజర్వుడ్ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. 
 
ఈ నెల 18వ తేదీన సికింద్రాబాద్ నుంచి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందేడ్‌కు, 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments