Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి మల్లారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ విచారణకు ఐటీ లేఖ

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (11:00 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చుట్టూత ఆదాయపన్ను శాఖ అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. ఆయనకు చెందిన గృహాలు, కార్యాలయాల్లో రెండు రోజులు పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.18 కోట్ల మేరకు నగదు, 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 16 మందికి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. 
 
మరోవైపు, ఐటీ అధికారుల దాడి ఘటనతో పాటు ల్యాప్ టాప్ వ్యవహారాన్ని ఐటీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నిర్వహించిన సోదాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాయనున్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు బహిర్గతం కావాలంటే ఈడీ దర్యాప్తు చేయాలని ఐటీ శాఖ గట్టిగా భావిస్తుంది. ఇదే జరిగితే మల్లారెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకోవడం తథ్యంగా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments