Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి మల్లారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ విచారణకు ఐటీ లేఖ

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (11:00 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చుట్టూత ఆదాయపన్ను శాఖ అధికారులు ఉచ్చు బిగుస్తున్నారు. ఆయనకు చెందిన గృహాలు, కార్యాలయాల్లో రెండు రోజులు పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.18 కోట్ల మేరకు నగదు, 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 16 మందికి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. 
 
మరోవైపు, ఐటీ అధికారుల దాడి ఘటనతో పాటు ల్యాప్ టాప్ వ్యవహారాన్ని ఐటీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నిర్వహించిన సోదాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాయనున్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు బహిర్గతం కావాలంటే ఈడీ దర్యాప్తు చేయాలని ఐటీ శాఖ గట్టిగా భావిస్తుంది. ఇదే జరిగితే మల్లారెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకోవడం తథ్యంగా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments