తెలుగు రాష్ట్రాల్లోనే టాప్... రూ. 10 కోట్లు ఇన్‌కమ్ టాక్స్ పే చేసింది... ఆమె ఎవరు?

ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంద

Webdunia
బుధవారం, 25 జులై 2018 (18:29 IST)
ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిజాయితీగా ఐటీ శాఖకు పన్ను కట్టేస్తున్నారు. వారు కడుతున్న ఐటీ పన్ను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. 
 
తాజాగా ఐటీ సెక్టారుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 10 కోట్లను చెల్లించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 సంవత్సరానికి గాను ఆమె రూ. 10 కోట్లను టాక్సుకు చెల్లించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. కానీ ఆమె పేరును మాత్రం చెప్పలేదు. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి టాక్సు చెల్లించిన మొత్తం రూ. 49,775 కోట్లుగా వున్నట్లు అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 24 శాతం అధికమని చెప్పారు. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ధనవంతులు అయిపోతున్నారన్నమాట. శుభమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments