Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైలు... కేంద్రం గ్రీన్ సిగ్నెల్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:50 IST)
దేశంలోని రెండు పెద్ద మహానగరాల మధ్య బుల్లెట్ రైలు రానుంది. ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను తయారు చేయాల్సిందిగా సంబంధింత శాఖ అధికారులను కోరింది.
 
దేశవ్యాప్తంగా ఏడు కొత్త మార్గాలకు సంబంధించి డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి నివేదిక) సిద్ధం చేయాలని హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్)ను కేంద్రం ఆదేశించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లని పేర్కొన్నారు.
 
కాగా, ఇప్పటికే దేశంలో అహ్మదాబాద్ - ముంబైల మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన విషయం తెల్సిందే. మొత్తం 508.17 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభం కాగా, దీని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. 
 
వాస్తవానికి ఈ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తికావాల్సివుంది. కానీ, భూసేకరణ సంబంధిత సమస్యలు, కరోనా వంటి సమస్యల కారణంగా ఇది అక్టోబరు 2028 నాటికి వాయిదా పడే అవకాశాలున్నట్టు కేంద్ర రైల్వే వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments