Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైలు... కేంద్రం గ్రీన్ సిగ్నెల్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:50 IST)
దేశంలోని రెండు పెద్ద మహానగరాల మధ్య బుల్లెట్ రైలు రానుంది. ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను తయారు చేయాల్సిందిగా సంబంధింత శాఖ అధికారులను కోరింది.
 
దేశవ్యాప్తంగా ఏడు కొత్త మార్గాలకు సంబంధించి డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి నివేదిక) సిద్ధం చేయాలని హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్)ను కేంద్రం ఆదేశించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లని పేర్కొన్నారు.
 
కాగా, ఇప్పటికే దేశంలో అహ్మదాబాద్ - ముంబైల మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన విషయం తెల్సిందే. మొత్తం 508.17 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభం కాగా, దీని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. 
 
వాస్తవానికి ఈ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తికావాల్సివుంది. కానీ, భూసేకరణ సంబంధిత సమస్యలు, కరోనా వంటి సమస్యల కారణంగా ఇది అక్టోబరు 2028 నాటికి వాయిదా పడే అవకాశాలున్నట్టు కేంద్ర రైల్వే వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments