Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు ... నిఘా విభాగం నిర్ణయం

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (17:20 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పోలీస్ భద్రతను పెంచింది. ఈయన్ను హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారీతో ఓ కిరాతక ముఠా పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు చేధించిన విషయం తెల్సిందే. ఈ ప్లాన్ అమలుకు ముందే బయటపడింది. దీంతో శ్రీనివాస్ గౌడ్‍‌కు ప్రాణాపాయం తప్పింది. 
 
అయితే, మంత్రి హత్యకు కుట్ర, తదనంతర పరిణామాలను పరిశీలించిన రాష్ట్ర నిఘా విభాగం తాజాగా ఆయనకు భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని నిఘా విభాగ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెంట జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రానికి సాయంత్రానికి తిరిగిరానున్నారు. రాష్ట్రానికి వచ్చిన మరుక్షణమే ఆయనకు భద్రత పెంచాలని నిఘా విభాగం అధికారులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments