Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదు

Webdunia
బుధవారం, 17 మే 2023 (16:40 IST)
హైదరాబాద్ నగరంలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదైంది. ఈ తరహా కేసులు నమోదుకావడం ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ తరహా లిక్కర్ అలెర్జీ కేసును వైద్యులు గుర్తించారు. ఆగ్రాకు చెందిన జాన్ (36) అనే వ్యక్తికి మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆయన ముఖం ఎర్రబడటంతో వైద్యులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఆయన నగరంలోని ఓ ప్రైవేటు అలెర్జీ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లగా, ఈ అలెర్జీ కేసు వెలుగు చూసింది. ఆయన్ను పరిశీలించిన వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ లిక్కర్ అలెర్జీగా గుర్తించారు. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా మహా అయితే, వంద వరకు ఉండొచ్చని తెలిపారు. 
 
అయితే, జాన్‌కు ఈ అలెర్జీ రావడానికి కారణాలను విశ్లేషిస్తే, కొన్ని నెలల క్రితం జాన్ ఓ విందు పార్టీకి వెళ్లి అక్కడ మద్యం సేవించాడు. ఆ తర్వాత ముఖంపై వేడిగా ఉండటంతో అద్దంలో చూసుకోగా, ఎర్రబడినట్టు కనిపిచింది. చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్సతో నయం చేసుకున్నాడు. కొంతకాలానికి మళ్లీ మద్యం సేవించడంతో తిరిగి అదే సమస్య ఉత్పన్నమైంది. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చి అశ్విని అలెర్జీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయగా, అలెర్జీ కేసుగా నమోదైంది. మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలెర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments