Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:47 IST)
రూ. 2 వేలు నోట్లు ఇస్తే రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.12 లక్షలు వసూలు చేసారు. ఈ నగదును ఈనెల 21వ తేదీన తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్నీ సంచిలో ఉంచితే రెండు రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించారు. రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...
 
అయితే నిందితులు ఐలయ్యను మోసం చేసారు. ఆ సంచిలో తెల్ల కాగితాలు ఉంచి, నగదును పట్టుకెళ్లిపోయారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. అందులో ఉన్న తెల్ల కాగితాలను చూసి ఐలయ్య షాక్‌కు గురైయ్యాడు. తాను మోసపోయాడని గ్రహించిన ఐలయ్య పోలీసులను ఆశ్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేక్‌ నైదా అనే నిందితుడిని అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన నైదా నుండి పోలీసులు రూ.12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments