Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి..

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:43 IST)
లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్ బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వంద గజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే... అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నా పై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు.

కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments