లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి..

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:43 IST)
లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్ బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వంద గజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే... అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నా పై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు.

కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar :ఉగాదికి రావాలని వారి కోరిక మేరకు వస్తున్నాం ఆశీర్వదించండి: హరీశ్ శంకర్

Ramcharan: పవన్ కళ్యాత్ తో చిరంజీవి, రామ్ చరణ్ మనోహరమైన దృశ్యం!

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA) లకు ఎంపికైన చిరంజీవి, నాగచైతన్య, రష్మిక మందన్నా

కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు... ఎగ్ లెస్ కేకే కట్ చేశాం.. దువ్వాడ శ్రీనివాస్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

తర్వాతి కథనం
Show comments