లంచం అడిగిందని నిలదీస్తే... చెప్పుతో దాడి..

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:43 IST)
లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.

పికెట్​కు చెందిన రామ్​రెడ్డి లాల్ బజార్​ విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. తన వంద గజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే... అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్​లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు.

లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నా పై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్​లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు.

కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు మానవ హక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments