తెలంగాణ పీసీసి రేసులో నేనున్నా, నాకిస్తే సీట్లు ఓట్లు ఎలా రావో చూస్తా: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:15 IST)
దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు హస్తం పార్టీని వదిలేసి కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పీసీసి చీఫ్ పదవి ఇస్తే తెలంగాణలో ఓట్లు, సీట్లు ఎలా రావో చూస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలాంటి బూస్ట్ కావాలో అది తన దగ్గర వుందన్నారు. పార్టీకి పునర్ వైభవం తెచ్చే మందు తన వద్ద వుందని చెప్పుకొచ్చారు.
 
వాస్తవానికి తను గత ఏడాదిన్నరగా పీసీసి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఐతే అధిష్టానం ఆ పగ్గాలను తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో బలం వచ్చేట్లు చేస్తానని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments