Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకింది.. ఎవరూ తాకొద్దు.. వివాహిత ఆత్మహత్య

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (13:09 IST)
ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తనకు కరోనా సోకిందనీ, అందువల్ల తనను ఎవరూ తాకొద్దని సూసైడ్ నోట్ రాసిపెట్టి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాకు చెందిన 37 యేళ్ల మహిళ తన భర్త, కొడుకు (12)తో కలసి అల్కాపూర్‌లో నివసిస్తోంది. ఈమె ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
శనివారం రాత్రి భోజనాల తర్వాత అందరూ కలిసే నిద్రపోయారు. ఉదయం 10 గంటల సమయంలో నిద్రలేచిన భర్త.. భార్య కనిపించకపోవడంతో పక్కగదిలోకి వెళ్లి చూడగా, అక్కడ భార్య ఫ్యాన్‌కు విగతజీవిలా వేలాడుతూ కనిపించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఓ లేఖ దొరికింది. తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకవద్దని అందులో రాసిపెట్టి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడ పరీక్షలు చేయించుకుంది? ఫలితం ఎప్పుడు వచ్చింది? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments