Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో అమ్మాయిలు లేదా మహిళలు వెళుతుంటే మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుంటారు.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (15:54 IST)
కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో అమ్మాయిలు లేదా మహిళలు వెళుతుంటే మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుంటారు. ఇక నుంచి ఇలాంటివి జాన్తానై అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. 
 
ట్రిపుల్ రైడింగ్‌కి జరిమానాగా వెయ్యి రూపాయలు ఇప్పటివరకు వసూలు చేసేవారు. ఇక నుంచి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. అంటే ట్రిపుల్ రైడింగ్ వెళితే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందేనంటున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. ఈ నిబంధనను త్వరలోనే అమలు చేయనున్నారు. 
 
దీనిపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, ముఖ్యంగా యువతలో మార్పు కోసం ఈ కఠిన నిబంధన అమలు చేస్తున్నామన్నారు. మోటార్ వాహన చట్టం 188 కింద వెయ్యి ఫైన్ వసూలు చేస్తుండగా, యువతలో ఏమాత్రం మార్పు లేదన్నారు. అందుకే ట్రిపుల్ రైడింగ్‌లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలిపారు. 
 
ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ, ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేశారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments