Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి సండే ట్రాఫిక్ ఆంక్షలే ... సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు..

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (08:56 IST)
సాధారణంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ణయించింది. 
 
వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా దానిపై ఆయన వెంటనే స్పందించారు. 
 
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు. 
 
ఈ కొత్త నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో ఎప్పుడు రద్దీగా ఉండే ట్యాంక్ బండ్‌పై ఇకపై ప్రతి ఆదివారం కాస్త ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిరానుంది. అదేసమయంలో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయంతో ట్యాంక్ బండ్ వీక్షణకు మరింతమంది సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments