Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనొక అమ్మాయిని లవ్ చేశారు.. ఫ్రెండ్స్‌, ఆమె మోసం చేశారు.. చనిపోతున్నా...

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (12:07 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి తన ప్రియురాలితో పాటు.. స్నేహితుల చేతిలో మోసపోయాడు. దీంతో ఇక జీవించడం వృథా అనుకుని లైవ్‌లో ఉరివేసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరం వనస్థలిపురం, ముండ్లమూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం (36) లారీ యజమాని. ఇతనికి భార్య ఖాసీంబి, కుమారుడు (10), కుమార్తె (8) ఉన్నారు. 
 
ఆర్థికంగా నష్టపోయిన అతను శనివారం ఉదయం తన స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం వీఎంఆర్‌ లాడ్జ్‌ అండ్‌ బార్‌లో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి మద్యం తాగి గదికి వెళ్లి పడుకున్నారు. 
 
తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం తాగుతుండగా.. షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ తాను ప్రేమించి మోసపోయానని, స్నేహితులూ మోసం చేశారని, చనిపోతున్నానంటూ సీలింగ్‌ ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకున్నాడు. 
 
తన స్నేహితుడు ఎంతకీ కిందకు రాకపోవడంతో వేణుగోపాల్ ఫోన్‌ చేశాడు.. స్పందించకపోవడంతో గదికి వెళ్లాడు. కిటికిలోంచి చూసే సరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments