Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్: వాగులో కొట్టుకుపోయిన మహిళ.. చివరికి?

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (10:18 IST)
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వాగుల్లా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఓ మహిళ కాలువలో పడి మృతి చెందింది. మహిళను రక్షించేందుకు స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కిలోమీటరు దూరంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
 
స్కందగిరి ఆలయంలో భిక్షాటన చేస్తున్న మహిళ(45) గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో దూద్ బావి వద్ద కాలువ దాటేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది.
 
మహిళ కాలువలో కొట్టుకుపోవడంపై స్థానికులు స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 
 
చివరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments