Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాలు రావొద్దని కోరుకున్న మేయర్ ఎవరు?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:09 IST)
హైదరాబాద్ నగర ప్రథమ మహిళగా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికార తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె ఈమె. అయితే, ఆమె తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
"ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్ కావడంతో పాటు.. ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశాయి. 
 
గత యేడాది తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసిముద్దయింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై ఇంట‌ర్వ్యూ చేస్తోన్న జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా విజ‌య‌ల‌క్ష్మి ఆ వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు స‌ర్కారుతో పాటు జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నాయ‌న్నారు.
 
అదేసయమంలో ప్రజలు కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నాలాల ఆక్రమణల వల్లే వ‌ర్షాల‌కు కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల విజయలక్ష్మి కోరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments