Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాలు రావొద్దని కోరుకున్న మేయర్ ఎవరు?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:09 IST)
హైదరాబాద్ నగర ప్రథమ మహిళగా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికార తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె ఈమె. అయితే, ఆమె తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
"ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్ కావడంతో పాటు.. ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశాయి. 
 
గత యేడాది తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసిముద్దయింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై ఇంట‌ర్వ్యూ చేస్తోన్న జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా విజ‌య‌ల‌క్ష్మి ఆ వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు స‌ర్కారుతో పాటు జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నాయ‌న్నారు.
 
అదేసయమంలో ప్రజలు కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నాలాల ఆక్రమణల వల్లే వ‌ర్షాల‌కు కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల విజయలక్ష్మి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments