వర్షాలు రావొద్దని కోరుకున్న మేయర్ ఎవరు?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:09 IST)
హైదరాబాద్ నగర ప్రథమ మహిళగా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికార తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె ఈమె. అయితే, ఆమె తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
"ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్ కావడంతో పాటు.. ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశాయి. 
 
గత యేడాది తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసిముద్దయింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై ఇంట‌ర్వ్యూ చేస్తోన్న జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా విజ‌య‌ల‌క్ష్మి ఆ వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు స‌ర్కారుతో పాటు జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నాయ‌న్నారు.
 
అదేసయమంలో ప్రజలు కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నాలాల ఆక్రమణల వల్లే వ‌ర్షాల‌కు కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల విజయలక్ష్మి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments