Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని టవల్‌ను గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (09:26 IST)
కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా చంపేశాడు. తెల్లని టవల్‌ను గొంతుకు బిగించి ఊపిరాడనీయకుండా చేసి ప్రాణం తీశాడు. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పార్థీబస్తీలో నివాసముండే శకత్వాల దర్శన్‌ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారి. ఈసీఐఎల్‌లో కూరగాయలు విక్రయిస్తూ స్వయం ఉపాధిపొందుతున్నాడు. ఈ క్రమంలో సౌందర్య అనే యువతిని ప్రేమించి పెంళ్లి  చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. అయితే, దంపతులిద్దరికీ రోజూ కలిసి మద్యం సేవించే అలవాటు ఉన్నది.
 
అయితే, ఈ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ భావించాడు. కానీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తిరిగి కలిసి జీవనం సాగిస్తున్నారు. అనంతరం గత వారం రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం తెల్ల టవల్‌తో భార్య గొంతు బిగించి, హతమార్చాడు. అనంతరం టవల్‌తో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments