Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఘోరం.. చూస్తుండగానే నీటిలో కొట్టుకునిపోయాడు...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:42 IST)
హైదాబాద్ నగరంలో దారుణం జరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని నాలాలు, మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ స్కూటరిస్టు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకునిపోయాడు. నగర శివారులోని సరూర్‌నగర్‌లో గతరాత్రి ఈ ఘటన జరిగింది. 
 
బాలాపూర్ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తుంది. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్‌బండ్‌‌కు వెళ్తోంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన ఎలక్ట్రీషియన్ నవీన్‌కుమార్ (32) గత రాత్రి సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద నుంచి తపోవన్‌ కాలనీ మీదుగా సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు.
 
భారీ వర్షాల కారణంగా తపోవన్ కాలనీ రోడ్డు నంబరు 6 నుంచి మినీ ట్యాంక్‌బండ్‌లోకి వరదనీరు ఉద్ధృతంగా వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు కాసేపు అక్కడే నిరీక్షించిన నవీన్ కుమార్ కాసేపటి తర్వాత వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. 
 
స్కూటీ అదుపుతప్పడంతో వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆయన చనిపోయివుంటాడని డీఆర్ఎఫ్ సిబ్బంది భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments