Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్టేషన్ పక్కనే యువకుడు దారుణ హత్య.. పోలీసులేం చేశారంటే..

భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (16:36 IST)
భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్ మూసాపేటలోని జనతానగర్‌లో రాజు అనే వ్యక్తి పాలవ్యాపారం చేస్తుండేవాడు. రాజుకు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు. చివరి  వ్యక్తి సుధీర్ కూకట్‌పల్లి లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్నిరోజులుగా తన స్నేహితులతో సుధీర్‌కు గొడవలుండేవి. ఆ గొడవల కారణంగా నలుగురు స్నేహితులు కలిసి ఉదయం కళాశాలకు వెళుతున్న సుధీర్‌ను వెంబడించి అతి దారుణంగా రోడ్డుపై నరికి నరికి చంపారు. కూత వేటు దూరంలో పోలీస్టేషన్, ఎప్పుడూ ప్రజలు తిరుగుతుండేవారు. అలాంటి ప్రాంతంలోనే హత్య జరగడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
యువకుడు దారుణ హత్యకు గురైన తరువాత తాపీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన తరువాత నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ నిందితుడి ద్వారా మిగిలిన వారిని ఈజీగా పోలీసులు కనిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments