Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని లొంగదీసుకున్నాడు... కూతురిపై అత్యాచారం... కామాంధుడి దారుణం...

ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (17:21 IST)
ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి. హైదరాబాదు లోని నేరేడ్‌మెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ అడ్డగుట్టలో 35 ఏళ్ల వితంతువు కూలీ పని చేసుకుంటూ బతుకీడుస్తోంది. ఈమె సోదరి 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమెకు పుట్టిన పాపను ఈమే పెంచుతోంది. ఆమెకు 12 ఏళ్లు. ఆరవ తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖలీల్ కళ్లు ఒంటరిగా వుంటున్న మహిళపై పడ్డాయి. ఆమెకు మాయ మాటలు చెప్పి, ఆసరాగా వుంటానని నమ్మించి ఆమెతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 
 
ఐతే గత నెల రోజుల క్రితం బాలికపై కన్నేసిన ఖలీల్... ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని గత నెలరోజులుగా ఆ బాలికపై చేస్తూనే వున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక పినతల్లి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments