Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమొచ్చిందో... కన్నబిడ్డలను చూస్తూ.. సెల్ఫీ తీస్తూ మహిళ బలన్మవరణం

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (14:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఆమెకు ఎలాంటి కష్టమొచ్చందో ఏమో తెలియదుగానీ, నవమాసాలు పెంచి కని పెంచిన కన్నబిడ్డలను చూస్తూ, సెల్ఫీ తీసుకుంటూ తనువుచాలించింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాలాపేటకు చెందిన మంజుల అనే మహిళకు 12 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్డులో బేకరీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు. 
 
అయితే శనివారం నాడు మంజుల తన బిడ్డలు చూస్తుండగానే ఉరేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రంజిత్, తేజస్ బేకరీలో ఉన్న తమ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
 
కానీ భర్త వచ్చేసరికి మంజుల ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments