Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలుడికి హెచ్.ఐ.వి.. బ్లడ్‌ బ్యాంకుపై కేసు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (13:11 IST)
హైదరాబాద్ నగరంలో తలసేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చిన మూడేళ్ల బాలుడు హెచ్.ఐ.వి వైరస్ సోకింది. ఈ కేసులో రక్తదానం చేసిన బ్లండ్‌బ్యాంకు‌పై కేసు నమోదైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లి అనే గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు గత ఏడు నెలలుగా తలసేమియాతో బాధపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాలుడికి రక్తమార్పిడి చికిత్స కోసం తండ్రి విద్యానగరులోని బ్లండ్ బ్యాంకు నిర్వాహకులను స్పందించారు. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ బాలుడికి రక్తమార్పడి చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన రక్తమార్పిడి కోసం బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు బ్లండ్ బ్యాంకుకు వచ్చారు. అక్కడ ఆ బాలుడికి నిర్వహించిన పారామెడికల్ పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్టు నిర్ధారణ అయిందని నల్లకుంట పోలీసులు వివరించారు. 
 
ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపిన పరీక్షల్లో ఎపుడు కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్‌గా రాలేదు. కానీ, తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో పోలీసులు బ్లడ్ బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments