Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీలకు మత్తు వదలగొడుతున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:29 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింకీ జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా పోలీసులకు చిక్కిన వారందరినీ ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. 
 
ఇటీవల జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ పబ్‌పై సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లైసెన్సును కూడా రద్దు చేసింది. అదేసమయంలో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. మత్తు పదార్థాలకు బానిసలైన ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా 13 మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. 
 
పైగా, పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల జాబితా ఉంది. దీంతో వీరి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులకు పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్ టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతిల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments