Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:09 IST)
సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బద్ధకం చూపుతుంటారు. ఏదైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఓటు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా ఓటు అసలు ఎందుకు వేయాలని.. ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేసినా ఉపయోగం ఉండదని భావించి ఓటెయ్యరు. కానీ ఒక మహిళ తన భర్త చనిపోయినా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా పేరూరులో భర్త మృతి చెందినా ఓటు హక్కు వినియోగించిన ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. పేరూరు నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళిన దంపతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. భర్త శ్రీనివాస్ అస్వస్థతకు గురయి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయినాసరే ఆ మహిళ భర్త చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments