బండి సంజయ్‌కు హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌..

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (20:28 IST)
హుజూరాబాద్‌ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. 
 
బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. డప్పు వాయిద్యాలు మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ఆరా తీశారు. బండి సంజయ్‎కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments