రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (20:52 IST)
కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్​వో రాకేశ్​ తెలిపారు. లోకో పైలెట్​ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్​వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్​ లోక్​ పైలెట్​ సిగ్నల్​ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. లోకో పైలట్​ చంద్రశేఖర్​తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్​వో తెలిపారు.

బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రమాదం వల్ల సికింద్రాబాద్​- ఫలక్​నుమా, కాచిగూడ-ఫలక్​నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్​ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్​నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్​ సిటీ, ఫలక్​నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు.

కాచిగూడ-గుంటూరు, ఫలక్​నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్

Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్

Suriya: తమిళ సంవత్సర సందర్భంగా సూర్య కరుప్పు నుండి రాతు రాసన్ విడుదల

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

టాలీవుడ్‌లో మరో ఐరెన్ లెగ్ హీరోయిన్ శ్రీలీలనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తర్వాతి కథనం
Show comments