Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. ఆ ఐదు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

Webdunia
శనివారం, 23 జులై 2022 (09:54 IST)
తెలంగాణ మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి. 
 
నైరుతి రుతుపవనాలతో పాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. 
 
అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని.. ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments