తెలంగాణలో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. ఆ ఐదు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

Webdunia
శనివారం, 23 జులై 2022 (09:54 IST)
తెలంగాణ మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి. 
 
నైరుతి రుతుపవనాలతో పాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. 
 
అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని.. ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments