మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (10:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి మూడు రోజలు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చి మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగివుందని వివరించింది. 
 
అలాగే, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తుమేరకు విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 
ఇదిలావుంటే, వచ్చే 72 గంటల పాటు వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల అక్టోబరు 4వ తేదీ వరకు ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు తెలిపారు. భారీ వర్షాల వల్ల బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా, అసన్‌సోల్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల దుర్గాపూజ మండపాలు వర్షంలో తడిసిపోవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments