Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో టీ టీడీపీ విలీనం : స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసు!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:51 IST)
తెలంగాణ రాష్ట్ర సమితిలో టీ టీడీపీని విలీనం చేసినట్టు గుర్తించడంతో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన టిడిపి ఎమ్మెల్సీలను టిఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో హైకోర్టు పేర్కొంది. 
 
మార్చి 9న తెలుగుదేశం ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండి సలీంలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి ఛైర్మన్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టిఆర్‌ఎస్‌ఎల్పీలో టిడిఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. 
 
దీన్ని సవాల్ చేస్తూ టిడిపి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు స్వామి గౌడ్‌కు నోటీసు జారీ చేసింది. అయితే,  స్వామిగౌడ్ హైకోర్టుకు వివరణ ఇస్తారా? ఇది తన పరిధిలోని వ్యవహారమని చెప్పి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments