Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:34 IST)
ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఓ శుభవార్త చెప్పింది. ఇంటర్ మొదటి సంవత్సరం టికెట్‌లను ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. 
 
ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు.
 
హాల్ టికెట్ లో ఏవైనా తప్పులు ఉంటే కాలేజీ ప్రిన్సిపల్ లేదంటే జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా హాల్ టికెట్‌లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టంచేశారు. 
 
ఇదిలావుంటే, గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఇతర కారణాలవల్ల ఇంటర్ పరీక్షలను నిర్వహించలేదు. అంతేకాకుండా విద్యార్థుల గత మార్కులను ఆధారంగా చేసుకొని పాస్ చేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments