Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్‌కు గుత్తా లేఖ!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:24 IST)
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. 
 
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో నీటి విడుదల తగ్గించాలని కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. రబీ పంటల కోసం నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాని కోరారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments