Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఊరేగింపులో డీజే వద్దన్నారని.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (11:44 IST)
పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడానికి తండ్రి నిరాకరించడం వల్ల మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణాలోని వనపర్తి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. అమరచింత మండలం కొంకలవానిపల్లెకు చెందిన తిరుపతయ్య మొదటి భార్య కుమారుడు అశోక్ పెళ్లి ఈ నెల 24న ఆత్మకూరు మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చయమైంది. 
 
అందుకోసం మంగళవారం జమ్ములమ్మ గ్రామ దేవత వేడుక చేసారు. పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడం కోసం రూ.25 వేలు ఇవ్వమని తండ్రిని కోరాడు. ఇప్పటికే వివాహ ఖర్చు పెరిగిందని, డీజేకి బదులు భోజన ఏర్పాటు చేసేందుకు ఆ డబ్బును ఖర్చు చేద్దామని చెప్పాడు. ఇందుకు మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. 
 
గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments