Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని తల్లి, బిడ్డను గులాబీ పాన్పుపై పడుకోబెట్టారు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (19:21 IST)
ఆడపిల్ల అంటే మొదటి నుంచి చిన్నచూపే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేటికీ అబ్బాయి కావాలనే పూజలు చేస్తుంటారు. అమ్మాయి పుడితే భారంగా భావిస్తారు. వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుడితే అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు తప్పవు. వారసుడే కావాలన్నది చాలామంది ఆశ.
 
కొంతమంది అయితే పుట్టిన ఆడబిడ్డను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తారు కూడా. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుప్రక్కన వదిలేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. కానీ మహబూబాబాద్ జిల్లా కె.సముద్రంలో మాత్రం సమాజం ఆశ్చర్యపోయేలా ఆడపిల్లకు సత్కారం జరిగింది. 
 
హైదరాబాద్‌కు చెందిన రమ్యకు, కె.సముద్రం పట్టణానికి చెందిన నవీన్‌తో మూడేళ్ళ క్రితం వివాహమైంది. రమ్యకు తొలి కాన్పులో పండంటి ఆడబిడ్డ పుట్టింది. మూడు నెలల తరువాత అత్తింటిగారికి వెళ్ళిన రమ్యకు అక్కడ ఊహించని విధంగా ఘనస్వాగతం లభించింది.
 
రావమ్మా మహాలక్ష్మీ అంటూ గులాబీ పూలపాన్పుపై ఆడబిడ్డను పడుకోబెట్టారు. బిడ్డతో సహా తల్లికి కూడా పూలవర్షంతో స్వాగతం పలికారు. ఇది చూసిన స్థానికులు కూడా ఆనందనం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments