Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని తల్లి, బిడ్డను గులాబీ పాన్పుపై పడుకోబెట్టారు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (19:21 IST)
ఆడపిల్ల అంటే మొదటి నుంచి చిన్నచూపే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేటికీ అబ్బాయి కావాలనే పూజలు చేస్తుంటారు. అమ్మాయి పుడితే భారంగా భావిస్తారు. వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుడితే అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు తప్పవు. వారసుడే కావాలన్నది చాలామంది ఆశ.
 
కొంతమంది అయితే పుట్టిన ఆడబిడ్డను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తారు కూడా. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుప్రక్కన వదిలేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. కానీ మహబూబాబాద్ జిల్లా కె.సముద్రంలో మాత్రం సమాజం ఆశ్చర్యపోయేలా ఆడపిల్లకు సత్కారం జరిగింది. 
 
హైదరాబాద్‌కు చెందిన రమ్యకు, కె.సముద్రం పట్టణానికి చెందిన నవీన్‌తో మూడేళ్ళ క్రితం వివాహమైంది. రమ్యకు తొలి కాన్పులో పండంటి ఆడబిడ్డ పుట్టింది. మూడు నెలల తరువాత అత్తింటిగారికి వెళ్ళిన రమ్యకు అక్కడ ఊహించని విధంగా ఘనస్వాగతం లభించింది.
 
రావమ్మా మహాలక్ష్మీ అంటూ గులాబీ పూలపాన్పుపై ఆడబిడ్డను పడుకోబెట్టారు. బిడ్డతో సహా తల్లికి కూడా పూలవర్షంతో స్వాగతం పలికారు. ఇది చూసిన స్థానికులు కూడా ఆనందనం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments