2022 ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం రద్దు: రేవంత్‌రెడ్డి

Webdunia
శనివారం, 10 జులై 2021 (06:56 IST)
కేసీఆర్‌‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని ఆయన స్పష్టం చేశారు.

అమరవీరుల స్థూపం పేరుతో పెద్ద దోపిడీ జరిగిందన్నారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?  విమర్శలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏ పార్టీ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్ఎస్‌కి ఎలా అధ్యక్షుడో,  తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు, కేటీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే, టీఆర్ఎస్‌ కూడా టీడీపీనేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

మోసానికి, దోపిడీకి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆయన ఆరోపించారు. అధికారాన్ని టీఆర్ఎస్‌ నుంచి బరాబర్ గుంజుకుంటామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. "నాకు పీసీసీ వచ్చింది కాబట్టే.. కిషన్‌రెడ్డికి కేబినెట్‌ పదవి" వచ్చిందని రేవంత్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments