ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కారు స్వీట్ న్యూస్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:07 IST)
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిపాలన కిందకు వచ్చే తెలంగాణలోని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా వర్కర్లకు) కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని 30 శాతం పెంచింది. కరోనా విజృంభిస్తున్న వేళ సర్కారు ఆశావర్కర్ల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పెంచింది.
 
ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు (జీవో ఎమ్‌ఎప్‌ నం 1)లో రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం గరిష్ట పరిమితిపై 30 శాతం చొప్పున పెంపుదల కోసం అనుమతిని ఇచ్చింది. దీంతో రూ.7, 500 నుండి రూ.9,750లకు నెలవారీ ప్రోత్సహకాలు పెరగనున్నాయి.
 
పనిభారం పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెరగవని ఆశా కార్మికులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి కనీస వేతనం చాలా తక్కువగా ఉంది.  వారు చేసే కృషికి కొంచెం ఎక్కువ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, టిఎలు మరియు డిఎలను కూడా ఇవ్వమని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరగడంతో ఆశా కార్మికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కార్మికులకు ఉపశమనం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments