Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్గిపెట్టి ఉందా అని అడిగి.. 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లారు

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:41 IST)
కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి కూడలిలో భుజంగ్ రెడ్డి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
 
నిన్న రాత్రి బైక్ వచ్చిన ఓ యువకుడు సిగరెట్ తీసుకొని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వమని అడిగాడు. యజమాని వొంగి కింద ఉన్న అగ్గిపెట్టి తీసి ఇచ్చే సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు దొంగలు. వెంటనే తేరుకున్న భుజంగ్ రెడ్డి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసి అరుస్తూ  పరిగెత్తుకుంటా వెళ్లాడు. 
 
అయినా  దొంగలు బైకు మీద పారిపోవడం వల్ల ఫలితం లేక పోయింది. భుజంగరెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషనును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్‌ను పరిశీలించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments