Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్లగూడాలో దొంగల బీభత్సం... బంగారం-వెండి దోపిడి

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:06 IST)
రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధిలోని బండ్లగుడాలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇల్లును గుల్ల చేశారు దుండగులు. పది తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించారు. 
 
ఖమ్మం ప్రాంతానికి చెందిన భాజా, సాధన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బండ్లగుడాలోని భారతి నగర్‌లో అద్దెకు ఉంటుంన్నారు. నిన్న సాయంత్రం భాజా సొంత పనిమీద ఖమ్మం వెళ్ళేందుకు భార్య సాధనాను పక్కనే ఉంటున్న అత్తవారింట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. 
 
ఉదయం ఇంటి యజమాని ఇంటి వైపు చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో సాధనకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సాధన ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
 
బీరువాలోని పది తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌లను రంగంలోకి దింపి అధారాలను సేకరిస్తున్నారు.
 
కాలనీలో ఒక ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రాత్రి టైంలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కవర్ పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని చూసి సాధన ఆ కవర్ వాళ్ల ఇంట్లోనిది అని గుర్తుంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments